తిరుపతి\అనంతపురం: తిరుపతి వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లిన నలుగురు ఓ ప్రమాదంలో చనిపోయారు. తిరుమల నడక దారిలో పెట్రోలు బంకు దగ్గర ఓ లారీ అదుపు తప్పి భక్తుల మీదకి వెళ్లడంతో ఆ ఘోర ప్రమాదంలో నలుగురు చనిపోయారు. అందులో ఒకరు అమలాపురంలోని మెట్లపాలెంకు చెందిన వెంకటేశ్వరరావు, మరో ఇద్దరు చిన్నపిల్లు, ఒక మహిళ ఉన్నారు.
మరో దుర్ఘటన అనంతపురంలోని రాంనగర్ గేటు దగ్గర జరిగింది. ముగ్గురు వ్యక్తులు రైల్వే గేటు దాటుతుండగా రైలు ఢీకొని ఆ ముగ్గురు చనిపోయారు.