రామోజీ రావు రాబందు: జగన్ సాక్షి టీవీ చానెల్ దాడి

చంద్రబాబు, రామోజీ గోబెల్స్ ను మించిపోయారని వ్యాఖ్యానించింది. అబద్ధాన్ని పది మందితో పదే పదే అనిపిస్తే నిజమవుతుందనే ఉద్దేశంతో సిండికేట్ గా తయారైందని వ్యాఖ్యానించింది. దొడ్డిదారిన అధికారంలోకి రావపడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలకు రామోజీ సహకారం అందిస్తున్నారని చెప్పింది. హైదరాబాదులోని జగన్ ఇంటిలోకి అక్రమంగా ప్రవేశించడానికి మీడియా ప్రయత్నించిందని, సెక్యూరిటీ గార్డు అడ్డుకుంటే దాడి చేశారని కథలు అల్లిందని చెప్పింది. టీవీ9, స్టూడియో ఎన్ లు జగన్ ఇంటిపై కట్టుకథలు అల్లాయని విమర్శించింది. జగన్ పై రామోజీ రావు కట్టు కథలు రాస్తే ఓ వైపు చంద్రబాబు మరో వైపు తెలుగుదేశం నాయకులు ఎర్రంనాయుడు, గాలి ముద్దు కృష్ణమ నాయుడు వంటి నాయకులు విమర్శలు చేయడం పరిపాటిగా మారిందని, ఓ పద్ధతి ప్రకారం అబద్ధాన్ని నిజం చేయడానికి ఓ వలయంలా పని చేస్తున్నారని వ్యాఖ్యానించింది. లోపాయికారిగా వారంతా చేతులు కలిపారని విమర్శించింది. రామోజీకి చెందిన ఈనాడు దినపత్రికను, ఈటీవి చానెల్ ను సాక్షి చానెల్ విషపుత్రికలుగా అభివర్ణించింది.












Click it and Unblock the Notifications