కెసిఆర్ తో గద్దర్ ఢీ: డిసెంబర్ 9న బలప్రదర్శనకు పోటీ సభ

Gaddar
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును ఢీకొట్టడానికే తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడు గద్దర్ నిర్ణయించుకున్నారు. కెసిఆర్ పై ఆయన శుక్రవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహబూబ్ నగర్ జిల్లా పర్యటనకు వెళ్లిన ఆయన కెసిఆర్ తెలంగాణ కోసమే కాదు, మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గానికి ఏం చేశారంటూ ప్రశ్నించారు. పార్లమెంటులో కెసిఆర్ తెలంగాణ గురించి మాట్లాడలేదని దుయ్యబట్టారు. కెసిఆర్ మాత్రం గద్దర్ వ్యవహారంపై నోరు మెదపడం లేదు. గద్దర్ వార్తలకు రాజ్ న్యూస్ లో స్థానం కూడా కల్పించడం లేదు. గద్దర్ ప్రజా ఫ్రంట్ వ్యవహారాన్ని దాని మానానికి దాన్ని వదిలేయాలని కెసిఆర్ అనుకున్నారా, ఏమె తెలియదు. కానీ గద్దర్ కు ప్రతివ్యూహాన్ని ఆయన అనుసరిస్తున్నారనే అనుకోవాల్సి ఉంటుంది.

ఇదిలావుండగా, డిసెంబర్ 9వ తేదీన వరంగల్ లో భారీ బహిరంగ సభను నిర్వహించాలని తెరాస పొలిట్ బ్యూరో నిర్ణయించింది. అదే రోజు గద్దర్ ప్రజా ఫ్రంట్ హైదరాబాదులోని నిజాం కళాశాల మైదానంలో బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఈ తేదీలను తామే ముందు ప్రకటించామని తెరాస, ప్రజా ఫ్రంట్ నేతలు పరస్పరం చెప్పుకుంటున్నారు. కానీ పోటాపోటీ బలప్రదర్శనకు రెండు సంస్థలు కూడా సిద్ధపడుతున్నాయని భావించాల్సి ఉంటుంది. అంతేకాకుండా, గద్దర్ గ్రామ పర్యటనలకు శ్రీకారం చుడితే, కెసిఆర్ పల్లె బాటకు పిలుపునిచ్చారు. డిసెంబర్ చివరి వారంలో శ్రీకృష్ణ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించేలోగా తమ తమ బలాలను సుస్థిరం చేసుకోవాలని ఇరు వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+