రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విజయవాడ లాడ్జిలో కొడుకు చేతిలో తండ్రి దారుణ హత్య?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vijayawada
విజయవాడ: సోమవారం ఉదయం విజయవాడలోని టెక్సో లాడ్జిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. రాజమండ్రికి చెందిన బాలగంగాధర్ అనే వ్యక్తి అతని కొడుకుతో కలిసి ఆదివారం సాయంత్రం విజయవాడలోని ఓ లాడ్జిలో దిగారు. అయితే ఉదయం 10 గంటల వరకు తలుపు తీయక పోవటంతో లాడ్జి సిబ్బంది వెళ్లి చూశారు. బాలగంగాధర్ చనిపోయి ఉండడాన్ని గమనించారు.

ఆయన మెడకు నైలాన్ తాడు బిగించి ఉంది. అయితే ఆయన కొడుకు మాత్రం కనిపించలేదు. దీంతో తండ్రిని కొడుకే చంపి పరారయినట్లు పోలీసులు భావిస్తున్నారు. బాలగంగాధర్ రాజమండ్రి ఆర్టీసీ ఉద్యోగి. తండ్రీ కొడుకులు విజయవాడకు ఏ పని మీద వచ్చారో సమాచారం లేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X