హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిఎం రోశయ్యపై విసుగు చెంది ఢిల్లీలో తేల్చుకోనున్న చిరంజీవి

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. రోశయ్యపై ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి పూర్తిగా విసిగిపోయినట్లు కనిపిస్తున్నారు. ప్రతి చిన్న విషయానికి ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించే చిరంజీవి ఈ మధ్య కాలంలో రోశయ్యకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశానికి పార్టీ ప్రతినిధులను కూడా పంపలేదు. రోశయ్య తీరుపై చిరంజీవి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి మంత్రివర్గ విస్తరణ చేపట్టడంలో చేస్తున్న జాప్యమే అందుకు కారణమని భావిస్తున్నారు. మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణ చేపడితే ప్రజారాజ్యం పార్టీకి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లభిస్తుందనేది మాట. చిరంజీవికి ఉప ముఖ్యమంత్రి పదవో, ప్రధానమైన శాఖనో దక్కుతుందని కూడా ప్రచారం జరిగింది. అధికారంలో పాలు పంచుకోవాలని ఉవ్వళ్లూరుతున్న చిరంజీవి మంత్రివర్గ విస్తరణలో ఆలస్యం అవుతుండడంతో కాంగ్రెసుకు దూరమవుతన్నట్లు కూడా చెబుతున్నారు.

రోశయ్య మంత్రివర్గ విస్తరణపై అంతు పట్టని చిరంజీవి కాంగ్రెసు అధిష్టానంతోనే విషయాన్ని తేల్చుకోవడానికి సిద్ధపడుతున్నట్లు చెబుతున్నారు. నేరుగా కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతోనో, ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తోనో తేల్చుకోవాలని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు. చిరంజీవి త్వరలో ప్రధానిని కలుస్తారని పార్టీ నాయకులు చెప్పారు. రోశయ్య చేతుల్లో ఏమీ లేదని కూడా ఆయనకు చాలా కాలం తర్వాత అవగాహనకు వచ్చినట్లు చెబుతున్నారు. దీంతో అధిష్టానంతోనే నేరుగా మాట్లాడాలని ఆయన అనుకుంటున్నట్లు సమాచారం. రాజ్యసభ ఎన్నికల్లో పూర్తి సహకారం అందించిన తమకు ప్రతిఫలం దక్కకపోవడం పట్ల చిరంజీవి అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X