దేశంలో వామపక్ష తీవ్రవాదం పెరుగుతోంది: ముఖ్యమంత్రి రోశయ్య

అంతర్గత తీవ్రవాదం దేశాన్ని, రాష్ట్రాన్ని పట్టి పీడిస్తుందని ఆయన అన్నారు. దేశంలో మతతత్వ శక్తులు పెరిగి పోయి దేశంలోని పలు ప్రాంతాలపై దాడులు చేస్తున్నారన్నారు. మతతత్వం పెరిగి దాడులకు పాల్పడే వారిని ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేస్తుందన్నారు. వామపక్ష తీవ్రవాదం రోజు రోజుకు పెరుగుతోందని దాన్ని తుదముట్టించాల్సిన అవసరం ఉందన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను ప్రభుత్వం అండగా ఉండి వారిని ఆదుకుంటుందన్నారు. పోలీసులు, వారి కుటుంబాల ఆరోగ్య రక్షణకు, క్వార్టర్ల కోసం ప్రభుత్వం నిధులు ఇస్తుందన్నారు.












Click it and Unblock the Notifications