హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రక్త చరిత్ర వల్ల ఫాక్షనిజం పెరుగదు: ఎమ్మెల్యే జెసి దివాకర్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

JC Diwakar Reddy
హైదరాబాద్: రామ్ గోపాల వర్మ రక్త చరిత్ర సినిమా వల్ల రాయలసీమలో ఫాక్షనిజం ఏమీ పెరగదని కాంగ్రెసు అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి అన్నారు. డిసెంబర్ తర్వాత సునామీ సృష్టిస్తామన్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై ఆయన తీవ్ర వ్యాఖ్య చేశారు. సునామీ సృష్టించే శక్తి కెసిఆర్ కు లేదని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కెసిఆర్ సునామీలు, గడువులు చాలా చాశామని ఆయన వ్యంగ్యంగా అన్నారు. కెసిఆర్ మాటలను ఎవరూ సీరియస్ గా తీసుకోరని ఆయన అన్నారు.

తెలంగాణపై కాంగ్రెసు వైఖరి త్వరలోనే తెలుస్తుందని ఆయన చెప్పారు. శ్రీకృష్ణ కమిటీకి నివేదికపై స్పందిస్తూ ఆ దురద, దుగ్ధ తమకు లేదని అన్నారు. తెలంగాణ వస్తుందో రాదో ఇప్పుడే చెప్పలేమని, అది త్వరలో తేలుతుందని ఆయన అన్నారు. తెలంగాణ కోసం ఢిల్లీలో ధర్నా చేయాలనే తెలుగుదేశం పార్టీ నాయకుల చర్య పనికి మాలింది అని ఆయన అన్నారు. బాబ్లీకి వ్యతిరేకంగా ధర్నా చేయడానికి వెళ్లినప్పుడు తెలుగుదేశం నాయకులకు ఏమైందో ఢిల్లీలో కూడా అదే అవుతుందని ఆయన అన్నారు. బాబ్లీ సీన్ రిపీట్ అవుతుందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X