కెసిఆర్ పై భగ్గుమన్న కాంగ్రెసు కర్నూలు ఎమ్మెల్యే టిజి వెంకటేష్

ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు తెరాస చెల్లని చెక్కులు ఇచ్చిందని, విద్యార్థులకు ద్రోహం చేస్తోందని ఆయన అన్నారు. హైదరాబాదును రెండవ రాజధానిగా చేయాలని ఆయన కోరారు. వేసవి సెలవుల్లో రాష్టపతి కూడా హైదరాబాదు విడిదికి రావడం సంప్రదాయంగా ఉందని, అందువల్ల ప్రజలు హైదరాబాదును దేశ రెండవ రాజధానిగా చేయాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారు. రాజ్యాధికారం వస్తే ఏం చేస్తారో కెసిఆర్ చెప్పడం లేదని ఆయన అన్నారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై కూడా ఆయన మండిపడ్డారు. పరిపాలనపై తమ పార్టీ నాయకులంతా కలిసి దృష్టి సారిస్తారని, ఇతర విషయాల్లో వ్యక్తిగతాభిప్రాయాలు వెల్లడిస్తారని, తమ పార్టీలో తమకు ఆ స్వేచ్ఛ ఉందని ఆయన అన్నారు. చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీలో స్వేచ్ఛ ఉండదని, అందుకే తాము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామని ఆయన చెప్పారు. చంద్రబాబు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లి ఏకఛత్రాధిపత్యం వహిస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications