తెలంగాణను కెసిఆర్ కుటుంబం నుంచి రక్షించాలి: తలసాని

పనిగట్టుకుని తమ అధినేత చంద్రబాబుపై కెసిఆర్, తెరాస పార్టీలు అభాండాలు వేస్తున్నారని ఆయన విమర్శించారు. ట్యాంక్బండ్పై కొమరం భీం విగ్రహం పెట్టకపోతే మిగతా విగ్రహాలు కూల్చివేస్తామని సిరిసిల్ల శాసన సభ్యుడు కె. తారకరామారావు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయన ప్రకటన దారుణమని ఆక్షేపించారు.కేసీఆర్ స్వయంకృతం వల్లే తెలంగాణలో ఉప పార్టీలు పుట్టుకొచ్చాయని ఎద్దేవా చేశారు. అవి రాజకీయ రూపు సంతరించుకోనప్పుటికీ ముందు ముందు రాజకీయరూపులోకి రావచ్చని అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications