ఓయూ ఐకాస సచివాలయ ముట్టడి ఉద్రిక్తం: విద్యార్థులపై లాఠీచార్జ్
సచివాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. గేటు ఎక్కి విద్యార్థులు లోనికి వెళ్లాలని ప్రయత్నించటంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేశారు. పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.
నవంబర్ 1వ తేదిన తెలంగాణ మంత్రులు ఎవరూ కూడా ప్రభుత్వం తరఫున జరిగే రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో పాల్గొనరాదని ఉస్మానియా యూనివర్శిటీ ఐక్య కార్యాచరణ సమితి మంత్రులకు ఆల్టిమేటం జారీ చేసింది. ఎవరైనా పాల్గొంటే తెలంగాణ ప్రజలు బుద్ది చెప్పటానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నవారే ఉత్సవాల్లో పాల్గోంటారని చెప్పింది. తెలంగాణకు అనుకూలంగా ఉన్నామని ప్రజల్లో నమ్మకం కలిగించడానికి వారు ఆ ఉత్సవాల్లో పాల్గొనరాదన్నారు.
Comments
Story first published: Tuesday, October 26, 2010, 11:56 [IST]