భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం: వేలాది ఎకరాల పంట నష్టం

వర్షాల తాకిడికి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 500 ఇళ్లు నేలకూలాయి. భారీ వర్షాలకు తుని, అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలోని లోతట్లు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 200 కి.మీ. మేర రహదారులు ధ్వంసం అయ్యాయి. పలుచోట్ల విద్యుత్తు స్తంభాలు నేలకూలాయి. జిల్లాలో సగటు వర్షపాతం 11.2 సెం.మీ.లు, కరప మండలంలో అత్యధికంగా 22.2 సెం.మీ. వర్షపాతం నమోదయ్యింది. సహాయ చర్యలు అందిచేందుకు జిల్లా కలెక్టరేట్లో టోల్ఫ్రీ నంబర్ 1077ను ఏర్పాటు చేశారు. వర్షాల కారణంగా పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం, మొగల్తూరు మండలాల్లో 10 వేల ఎకరాల్లో వరిపంట నీటమునిగింది. నర్సాపురం తీరప్రాంతంలో ఉప్పుటేరు పోటెత్తుతోంది. తణుకు, ఉండ్రాజవరం, పెరవలి, నిడదవోలు మండలాల్లో 15వేల ఎకరాల్లో వరిపంట నీటమునిగింది.












Click it and Unblock the Notifications