నెల్లూరుకు 400 కిలోమీటర్ల దురంలో జల్ తుఫాను
కాగా ప్రకాశం, చీరాలలో, వాడరేవు, కృష్ణపట్నం ఓడ రేవుల్లో 10 వ నెంబరు ప్రమాదపు హెచ్చరికను జారీ వాతావరణ శాఖ జారీ చేసింది. మచిలీపట్టణం, నిజాంపట్టణంలో 9వ ప్రమాద హెచ్చరికను, మిగతా ఓడరేవుల్లో మూడో ప్రమాదపు హెచ్చరికను జారీ చేశారు. కాగా భారీగా తుఫాను కురిసిన కృష్ణా ప్రాంతాన్ని సమీక్షించేందుకు 75 అధికారుల బృందం వెళ్లింది. నెల్లూరు జిల్లాల్లో 113 గ్రామాలను, ప్రకాశం జిల్లాల్లో 75 గ్రామాలను ఖాళీ చేయించడానికి ప్రభుత్వం సమాయత్తమయింది. తుఫాను ప్రభావ ప్రాంతాల్లో అధికారులకు సెలవులను రద్దు చేసింది. విశాఖపట్టణంలో సముద్రం 5మీటర్ల మేర ముందుకు వచ్చింది. తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడలో సముద్రం పోటెత్తుతుంది.
Comments
Story first published: Sunday, November 7, 2010, 14:33 [IST]