హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు నాపై కోపగించుకోలేదు: నాగం జనార్దన్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Nagam Janardhan Reddy
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనపై ఆగ్రహం వ్యక్తం చేయలేదని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ అన్నాక చిన్న చిన్న సమస్యలు వస్తాయని, అవి సర్దుబాటు అయ్యాయని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఎస్సై అభ్యర్థులతో అఖిలపక్ష సమావేశంపై వివాదంలో తాను చంద్రబాబుకు వివరణ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. హైదరాబాదు ఆరో జోన్ లో భాగమనే విషయం తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారని, అంతకన్నా ముఖ్యమంత్రి రోశయ్యకు ఏం చెప్తారని ఆయన అన్నారు. తెలంగాణ ఇచ్చేది, తెచ్చేది తామే అంటున్న కాంగ్రెసు నాయకులు ఎందుకు మాట్లాడడం లేదని ఆయన అడిగారు.

హైదరాబాద్ ఫ్రీజోన్ విషయంలో కాంగ్రెసు నాటకాలు ఆడడానికి ప్రయత్నిస్తే సహించబోమని ఆయన హెచ్చరించారు. తెలంగాణకు మొదటి నుంచీ కాంగ్రెసు పార్టీయే మోసం చేస్తోందని ఆయన అన్నారు. హైదరాబాద్ ఫ్రీజోన్ విషయంలో కాంగ్రెసు డ్రామాలు ఆడే అవకాశం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఆరో జోన్ లో భాగమని అసెంబ్లీలో తీర్మానం చేసి నెలలు గడుస్తున్నా చర్యలు తీసుకోకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. హుస్సేన్ సాగర్ ఖాళీగా ఉందని వ్యాఖ్యానించడం ద్వారా ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బ తీశారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు విద్యార్థులను రెచ్చగొట్టాయని ఆయన అన్నారు. తెలుగుదేశం నాయకులు టి. దేవేందర్ గౌడ్, విజయరామారావు కూడా మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X