ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి పేరు ఖరారు?

అధిష్టానానికి తలబొప్పి కట్టిస్తున్న కడప పార్లమెంటు సభ్యుడు వైయస్జగన్మోహన్ రెడ్డికి చెక్ చెప్పడానికి రెడ్డి వర్గానికి చెందిన వారిని, అలాగే శ్రీకృష్ణ కమిటీ నివేదిక డిసెంబర్ 31న ఇస్తున్నందున తెలంగాణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తెలంగాణకు చెందిన వ్యక్తికి ఇవ్వాలని కాంగ్రెసు అధిష్టానం యోచించినట్లు తెలుస్తోంది. అందుకే అధిష్టానం రాయలసీమకు చెందిన కిరణ్ కుమార్ రెడ్డిని పక్కకు పెట్టి తెలంగాణకు చెందిన జైపాల్ రెడ్డిని పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం. జైపాల్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కూర్చుండబెడితే ఫిబ్రవరిలో ప్రభుత్వం తెలంగాణ బిల్లు పెట్టనప్పటికీ తెలంగాణలో జరిగే అలజడిలను తగ్గించవచ్చని నిర్ణయించుకున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications