వైయస్ జగన్ మిషన్: వీరప్ప మొయిలీ గుర్రు, తీవ్ర వ్యాఖ్య

Veerappa Moily
న్యూఢిల్లీ: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాల పట్ల, ఆంధ్రప్రదేశ్ పార్టీ వ్యవహారాల్లో తన పాత్ర తగ్గడం పట్ల కేంద్ర మంత్రి, కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. సిఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని మొయిలీ తనకు చెప్పారని రాష్ట్ర కాంగ్రెసు నాయకులు చెప్పిన మాటను ఆయన ఖండించారు. సిఎల్పీ సమావేశం గురించి తనకు ఏమీ తెలియదని, ఆ సమావేశం ఏర్పాటు చేయాలని తాను సూచించలేదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. తాను సమావేశానికి వెళ్తున్నానని ఆయన చెప్పారు. అంతకు మించి మాట్లాడడానికి ఆయన నిరాకరించారు.

వైయస్ జగన్ వ్యవహారాన్నే కాకుండా రాష్ట్రంలోని పార్టీ వ్యవహారాలను నేరుగా సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ పర్యవేక్షిస్తున్నారని, వైయస్ జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తుండడం వల్ల మొయిలీని పక్కన పెట్టారని, సాంకేతికంగా మాత్రమే మొయిలీ ఇంచార్జీగా కొనసాగుతున్నారని తెలుస్తోంది. వైయస్ జగన్ కు వ్యతిరేకంగా తీసుకునే చర్యలను, జగన్ పట్ల అనుసరించాల్సిన వైఖరిని సోనియా గాంధీ అహ్మద్ పటేల్ ద్వారా ఖరారు చేయించి, దాన్ని అమలు చేయాల్సిన బాధ్యతను మొయిలీకి అప్పగించినట్లు తెలుస్తోంది. మొయిలీ ద్వారా తమ వ్యూహాన్ని అమలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది.

వైయస్ జగన్ పార్టీ వీడరని, నెల్లూరు ఓదార్పు యాత్ర జరిగిన తర్వాత వెనక్కి తగ్గుతారని మొయిలీ సోనియాకు చెబుతూ వచ్చారు. అయితే, జగన్ లో ఏ మాత్రం మార్పు రాలేదు. పైగా, ఎదురు దాడికి దిగుతున్నారు. ఆ దాడులకు తనకు సంబంధం లేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో మొయిలీపై సోనియా ఆగ్రహం వ్యక్తం చేశారని అంటున్నారు. ఈ పరిణామాలన్నీ మొయిలీకి మింగుడు పడడం లేదని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+