రాజకీయాలకు వైయస్ వివేకానంద రెడ్డి గుడ్ బై చెప్తారా?

YS Vivekananda Reddy
కడప: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి తమ్ముడు వైయస్ వివేకానంద రెడ్డి రాజకీయాలలోనుండి తప్పుకోవడానికి సిద్ధమయినట్లు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెసు అధిష్టానానికి, వైయస్ జగన్మోహన్ రెడ్డికి మధ్య తాను నలిగిపోతున్నానని ఆయన ఇడుపులపాయలో అన్నారు. మంగళవారం ఇడుపులపాయలోని వైయస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద వివేకానంద నివాళులు అర్పించారు. ఆ సమయంలో జగన్ కూడా అక్కడే తండ్రికి నివాళులు అర్పించారు. వైయస్సార్ కుటుంబ సభ్యులకు, కాంగ్రెసు అధిష్టానానికి తాను న్యాయం చేయలేనని, అందువల్ల శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని వైయస్ వివేకానంద రెడ్డి వైయస్ జగన్ కు చెప్పేసి వెళ్లిపోయినట్లు సమాచారం.

అప్పుడు వివేకానంద అక్కడేన్న జగన్ తో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. జగన్ వ్యవహారంతో ఆయన మనస్థాపానికి గురయ్యారు. కాంగ్రెసు అధిష్టానం తనకు మంత్రి పదవి ఇవ్వడాన్ని జగన్ కుటుంబాన్ని చీల్చే కుట్రగా అభివర్ణించడాన్ని, తానేదో జగన్ ను దెబ్బతీసే కుట్రలో భాగస్వామిని అయినట్లు తనపై జగన్ వర్గీయులు పరోక్ష విమర్శలు చేయడాన్ని నొచ్చుకున్నట్టు సమాచారం. అందుకే ఆయన సోమవారమే మంత్రిపదవిని తీసుకోనన్నారు. అయితే జగన్ తో వివేకానంద భేటీ అయినా వారిద్దరి మధ్య సయోధ్య కుదరలేదు.

ఇద్దరు రెండు నిమిషాలు కూడా మాట్లాడుకోక ముందే వివేకానంద బయటకు వచ్చేశారు. ఇటు కాంగ్రెసు అధిష్టానం, అటు జగన్ ఒత్తిడుల కారణంగా మనశ్సాంతిగా ఉండలేక పోతున్నానని వివేకానంద అభిప్రాయపడుతున్నారు. అందుకే పూర్తిగా రాజకీయాల్లోంచే వైదొలిగే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+