హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లోకేష్ ఛానల్లో వైయస్ రాజశేఖరరెడ్డి, రాజాల అవినీతి కథ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nara Lokesh
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత తనయుడు లోకేష్ కుమార్ ఛానల్లో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి, 2జి స్పెక్ట్రం కుంభకోణంలో ఇరుక్కున్న కేంద్ర మాజీమంత్రి రాజాలకు పోలిక పెట్టారు. అందరు రాజాలు ఏమో కాని ఇద్దరు రాజాలు మాత్రం లక్షల కోట్ల కుంభకోణాల్లో ఇరుక్కు పోయారంటూ ప్రసారం చేసింది. దివంగత ముఖ్యమంత్రి వైయస్ హయాంలో రాష్ట్రంలో లక్షకోట్ల కుంభకోణం జరిగిందని చెప్పింది. రాష్ట్ర బడ్జెట్ కన్నా అది కాస్త ఎక్కువేనంట. వైయస్ పేదల పెన్నిధి ఏమోగాని తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రం భారీ కుంభకోణాలు చేసి లక్షల కోట్ల రూపాయలు సంపాదించి పెట్టారని విమర్శించారు.

ఇక కేంద్రంలో కూడా 2జి స్పెక్ట్రంలో మాజీమంత్రి రాజా భారీ కుంభకోణాలకు పాల్పడ్డారని కేంద్ర బడ్జెట్లోలా ఆయన కుంభకోణం వాటా 17 శాతం అంటూ చెప్పారు. సుమారు లక్షా 74వేల కోట్ల రూపాయల కుంభకోణానికి రాజా పాల్పడ్డారు. స్వతంత్ర భారతదేశంలో రాజా చేసిన భారీ కుంభకోణం మరొకటి లేదని చెప్పారు. అయితే ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డికి గానీ, మాజీమంత్రి రాజాలకు గానీ ఇద్దరికీ అధిష్టానం అండదండలు పుష్కలంగా ఉన్నాయని ఆరోపించారు.

కాగా వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు కడప మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై రాజా కరెప్షన్ యువరాజ్ పేరుతో కథనాన్ని ప్రసారం చేసింది. తండ్రి పదవిలో ఉన్న కాలంలో తనయుడికి భారీ డబ్బులు సమకూర్చి పెట్టాడని ఆరోపించింది. పేదోళ్ల దేవుడిగా కీర్తించబడుతున్న వైయస్ తనయుడికి రాష్ట్ర ప్రజల అక్రమంగా కట్టబెట్టారని విమర్శించారు. ఆ అవినీతి సంపాదనతో వైయస్ జగన్ ఇడుపులపాయ, బెంగుళూరు, హైదరాబాదు తదితర ప్రాంతాల్లో ప్యాలెస్ లను తనదన్నే భవంతులు కట్టారన్నారు. జగన్ తండ్రిని అడ్డు పెట్టుకొని రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X