దశాబ్ద కాలంగా పవన్ వెన్నంటి నిలిచి - జనసేన తొలి రాజ్యసభ సభ్యుడిగా..!!

ఏపీ నుంచి కూటమి రాజ్యసభ అభ్యర్ధులు దాదాపు ఖరారయ్యారు. టీడీపీకి మూడు.. జనసేనకు ఒక సీటు దక్కేలా ఒప్పందం జరిగింది. అందులో భాగంగా జనసేన నుంచి అభ్యర్ధిని పార్టీ అధినేత పవన్ దాదాపు ఖరారు చేసారు. జనసేన తొలి రాజ్యసభ సభ్యుడిగా లింగమనేని రమేష్‌ పేరు దాదాపు ఖరారైంది. ఇప్పటికే పవన్ ఈ మేరకు పార్టీ నేతలకు సంకేతాలు ఇచ్చారు. తనను దశాబ్ద కాలంగా వెన్నంటి నిలిచిన రమేశ్ ను పవన్ రాజ్యసభకు పంపాలని దాదాపు నిర్ణయం తీసుకున్నారు.

రాజ్యసభలో తొలి సారి జనసేనకు ప్రతినిధ్యం దక్కనుంది. ఆ అవకాశం ప్రముఖ పారిశ్రామిక వేత్త లింగమేనని రమేష్ కు దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ మేరకు పవన్ సంకేతాలు ఇస్తున్నారు. తొలి నుంచి తన తో పాటు కలిసి ఉన్న వారికి ప్రాధాన్యత దక్కుతుందని స్పష్టం చేసారు. పార్టీ గెలుపు, ఓటములతో సంబంధము లేకుండా లింగమనేని రమేష్ తమ వెంట ఉన్నారు అని...దశాబ్దానికి పైగా ఆయన తన వెన్నంటి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పవన్ కళ్యాణ్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. రాజ్యసభ సీటు జనసేన నుంచి దక్కించుకొనేందుకు పలువురు పారిశ్రామిక వేత్తలు.. సినీ ప్రముఖులు ప్రయత్నాలు చేసారు. అయితే, తనకు దాదాపు దశాబ్ద కాలంగా తోడుగా నిలుస్తూ.. సహకారం అందించిన లింగమనేనికి అవకాశం ఇవ్వాలని పవన్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఎన్ని విమర్శలు వచ్చినా కూడా ఆయన ఈ విషయంలో వెనక్కి తగ్గకూడదు అనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

షర్మిలకు రాజ్యసీటు సీటు అడ్డుకుందెవరు, చివరి నిమిషంలో..!!
షర్మిలకు రాజ్యసీటు సీటు అడ్డుకుందెవరు, చివరి నిమిషంలో..!!
pawan-kalyan-all-set-to-announce-that-lingamaneni-ramesh-to-nominate-for-rajyasabha-from-janasena-as

అధికారికంగా ప్రకటించనున్న పవన్

తాను 2019 ఎన్నికల్లో ఓడిన తరువాత అనేక మంది అప్పటి వరకు తనతో ఉన్న ముఖ్యులు పార్టీ వీడి వెళ్లిపోయిన విషయాన్ని పవన్ గుర్తు చేస్తున్నారు. వారిలో మాజీ జేడీ లక్ష్మీనారాయణ, తోట చంద్రశేఖర్ వంటి వారి పేర్లు ప్రస్తావించారు. వారు ఇప్పటికీ తనతో ఉంటే రాజ్యసభ సభ్యులు అయ్యే అవకాశం ఉండి వచ్చని చెప్పుకొచ్చారు. లింగమనేని గ్రూప్ అధినేతగా ఉన్న లింగమనేని రమేశ్‌కు ఏపీ రాజకీయాల్లో, ముఖ్యంగా అమరావతి పరిసర ప్రాంతాల్లో బలమైన పరిచయాలు ఉన్నాయి. గత కొంతకాలంగా ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో పాటు టీడీపీ అగ్రనేతలతోనూ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. కూటమిలోని ఇరు పార్టీలకు ఆమోదయోగ్యమైన వ్యక్తి కావడం, సామాజిక సమీకరణాలు కూడా కలిసిరావ డంతో పవన్ ఆయన వైపే మొగ్గు చూపినట్లు సమాచారం. లింగమనేని రమేశ్ అభ్యర్థిత్వంపై జనసేన అంతర్గత వర్గాల్లో ఇప్పటికే స్పష్టత వచ్చినప్పటికీ.. అధినేత పవన్ సాయంత్రం అధికారికంగా మీడియా ముందుకు తీసుకురానున్నారు. పవన్ ప్రకటన తర్వాత కూటమి తరఫున పోటీ చేసే మిగిలిన ముగ్గురు టీడీపీ అభ్యర్థుల పేర్లు కూడా వెలువడే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+