రైతు సమస్యలు తీర్చకుంటే ప్రభుత్వం సంగతి తేలుస్తాం: చంద్రబాబు

అసలు రాష్ట్రంలో ప్రభుత్వమే లేదన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదన్నారు. కాగా అంతకుముందు రైతుల అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం, కమ్యూనిస్టు పార్టీ శాసనసభ్యులు అసెంబ్లీ ముందు బైఠాయించారు. దీంతో అసెంబ్లీ వద్ద భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేసి గోషామహల్ పోలీసు స్టేషన్ కు తరలించారు.
అంతకుముందు తమ సమస్యలను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడికి సమస్యలు చెప్పుకోవడానికి రైతులు అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. అయితే వారికి సిఎంను కలవటానికి అవకాశం దొరకలేదు. దీంతో వారు అక్కడే ధర్నాకు దిగారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. వారిని పబ్లిక్ గార్డెన్ లో నిర్బంధించారు. అయితే రైతులు తమను సిఎంను, చంద్రబాబునాయుడును కలుసుకునేందుకు అవకాశమివ్వాలని పబ్లిక్ గార్డెన్ దగ్గరే బైఠాయించారు.












Click it and Unblock the Notifications