చంద్రబాబు నోరు జారాడా, మనసులో మాట వచ్చిందా: చిరంజీవి

చంద్రబాబు ఏం చేసినా, ఏం చెప్పినా అధికారం కోసమేనని, చంద్రబాబు చేతల్లో మాటల్లో చిత్తశుద్ధి లేదని ఆయన అన్నారు. వైయస్ జగన్ గానీ చంద్రబాబు గానీ రైతుల కోసం చిత్తశుద్ధితో పోరాటం చేస్తే తన మద్దతు ఉంటుందని ఆయన చెప్పారు. ప్రజల విశ్వాసం పొందగలితే వారే అధికారాన్ని ఇస్తారని, ప్రత్యేకంగా అధికారం కోసం ప్రయత్నాలు అక్కర లేదని ఆయన అన్నారు. ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో ప్రయత్నాలు సాగించాలని, అప్పుడే ప్రజల విశ్వాసం పొందగలుగుతామని ఆయన చెప్పారు. ఆ రకంగా ప్రజల ఆశీస్సులు తాను పొందగలుతాననే నమ్మకం తనకు ఉందని ఆయన చెప్పారు. వైయస్ జగన్ పార్టీ భవిష్యత్తుపై చెప్పగలిగే భవిష్యవాణిని కానని ఆయన అన్నారు. సామాజిక న్యాయానికి తాను కట్టుబడి ఉన్నట్లు ఆయన తెలిపారు. తాను సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నానని, తన వైఖరిలో మార్పు లేదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications