సీమాంధ్ర సమైక్యాంధ్ర ఉద్యమాన్ని చల్లార్చడానికే శ్రీకృష్ణ కమిటీ: కాకా

కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆ స్థాయికి పోదల్చుకోలేదని కాకా అన్నారు. కేసీఆర్ను అధిష్ఠానం వద్దకు తీసుకెళ్లి 46 ఎమ్మెల్యే, 6 ఎంపీ సీట్లు ఇప్పించింది తానేనన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకూడదన్న ఉద్దేశంతోనే రాష్ట్రంలో బలగాలు మోహరిస్తుండొచ్చని చెప్పారు. వైయస్ జగన్ పార్టీ వల్ల కాంగ్రెస్కు ఎలాంటి నష్టం ఉండదని కాకా స్పష్టం చేశారు. ఇది సముద్రమని, ఎన్నో పార్టీలు వచ్చిపోయాయని వ్యాఖ్యానించారు. ఒకసారి బయటికెళ్లిన తర్వాత తలాఖ్ ఇచ్చినట్లేనన్నారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి తనకు వ్యక్తిగతంగా ఎంత నష్టం చేయాలో అంత చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. తనకు మంత్రి పదవి రాకుండా వైఎస్ అడ్డుకున్నా జగన్ను ముఖ్యమంత్రి చేయాలనిసమర్థించినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications