వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి హీరో రాజశేఖర్ దంపతులు

Rajasekhar
హైదరాబాద్: ప్రముఖ హీరో రాజశేఖర్ దంపతులు త్వరలో మాజీ పార్లమెంటు సభ్యుడు, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైయస్ జగన్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. మొదట తెలుగుదేశం పార్టీలో ఉన్న రాజశేఖర్ వైయస్ఆర్ సంక్షేమ పథకాలు నచ్చి కాంగ్రెస్ లో చేరుతున్నట్టు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంలో ప్రకటించారు. ఆ తర్వాత పలుమార్లు వారు వైయస్ పథకాలను పొగిడారు. వైయస్ మృతి తర్వాత రాజశేఖర్ దంపతులు కాంగ్రెస్ దూరంగా ఉంటూ వస్తున్నారు. వారు త్వరలో జగన్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించే అవకాశం ఉంది.

జగన్ కాంగ్రెస్ నుండి బయటకు వెళ్లడంతో వారు వైయస్ మీద అభిమానంతో జగన్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. నిత్యం ప్రజారాజ్యం వ్యవస్థాపక అధ్యక్షుడు చిరంజీవిని లక్ష్యంగా చేసుకొనే రాజశేఖర్ వైయస్ మృతి తర్వాత చిరంజీవికి దగ్గరవుతున్న కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. ఈ మధ్య ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం కాబోతుందని, మంత్రివర్గంలో చేరుతుందని పలు వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి కాంగ్రెస్ దగ్గరవుతుండటం, తమ అభిమాన రాజకీయ నాయకుడు వైయస్ తనయుడు జగన్ పార్టీ పెట్టడం ఈ నేపథ్యంలో వారు జగన్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+