కాంగ్రెసు కార్యాలయంపై కెయు విద్యార్థుల దాడి, కాంగ్రెసు నేతలకు హెచ్చరిక
కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు కాంగ్రెసు నాయకులను హెచ్చరిస్తున్నారు. జైల్లోని విద్యార్థుల విడుదలకు వెంటనే చర్యలు తీసుకోకపోతే కాంగ్రెసు నాయకులను నగర పొలిమేరల్లో అడుగు పెట్టనివ్వబోమని వారు హెచ్చరించారు. రేపు మంగళవారం మంత్రుల ఇళ్లు ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు రిలే నిరాహార దీక్షకు దిగారు. కాగా, విద్యార్థులపై కేసుల ఎత్తివేతను పరిశీలిస్తున్నామని హోం మంత్రి సబితా ఇంద్రా రెడ్డి చెప్పారు. వరంగల్ లో డిసిసి కార్యాలయంపై దాడి చేసిన ఘటనలో పోలీసులు వాసుదేవరెడ్డి, క్రాంతి, శ్రీకాంత్ తదితర విద్యార్థులను అరెస్టు చేశారు.
Comments
Story first published: Monday, December 20, 2010, 17:02 [IST]