పిఎసి ముందు హాజరు కావడానికి నేను రెడీ: ప్రధాని మన్మోహన్

పార్లమెంటు శీతాకాలం సమావేశాలను ప్రతిపక్షాలు స్తంభింపజేయడాన్ని ఆయన తప్పు పట్టారు. సిబిఐ దర్యాప్తు చేస్తున్నప్పటికీ 2జి స్పెక్ట్రమ్ స్కామ్ పై న్యాయవిచారణకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ప్రతిపక్షం జెపిసికి డిమాండ్ చేస్తూ పార్లమెంటు సమావేశాలను అడ్డుకోవడం సరైంది కాదని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ మాత్రమే దేశాన్ని ముందుకు నడిపిస్తుందని ఆయన చెప్పారు. సోనియా గాంధీ నాయకత్వాన్ని ఆయన ప్రశంసించారు. సోనియా వంటి నాయకురాలు ఉండడ దేశ ప్రజల అదృష్టమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications