ప్రభుత్వంపై వైయస్ జగన్ దీక్ష ప్రభావం: ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి

ఈ రెండు రోజులపాటు జగన్ చేపట్టిన నిహారాహార దీక్ష రాష్ట్రంలోని రైతులకు మేలు చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో రైతులు పంట నష్టపోయి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారన్నారు. నష్టపోయిన రైతులపై ప్రభుత్వం స్పందించనందునే వారికి సరైన న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆయన దీక్ష చేపట్టారన్నారు. ఈ దీక్ష ప్రభావం ప్రభుత్వంపై తప్పకుండా ఉంటుందన్నారు. ఈరోజు జగన్ కు మద్దతు పలికిన వారిలో మేకపాటితో పాటు దర్శి శాసనసభ్యుడు శివప్రసాద్ రెడ్డి ఉన్నారు.












Click it and Unblock the Notifications