గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో జరిగినట్లు కాశ్మీర్ లో కూడా జరగలేదు: సమైక్యాంధ్ర జెఎసి

By Pratap
|
Google Oneindia TeluguNews

United Andhra
గుంటూరు: తెలంగాణలో జరిగిన సంఘటనలు కాశ్మీర్ లో కూడా జరగలేదని సమైక్యాంధ్ర ఐక్య కార్యాచరణ కమిటీ (జెఎసి) కన్వీనర్ శామ్యూల్ అన్నారు. అటువంటి సంఘటనలు జరిగినప్పుడు అన్ని కేసులను ఎత్తేయాలనే కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుల డిమాండ్ సరైంది కాదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. అమాయకులపై పెట్టిన కేసులు ఎత్తేస్తే తమకు అభ్యంతరం లేదని, అయితే తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులను ఎత్తేయడం సరి కాదని ఆయన అన్నారు.

సిడబ్ల్యుసి సభ్యుడిగా ఉన్న కె. కేశవరావు హేతురహితమైన వాదనలు చేయడం సిగ్గు చేటని సమైక్యాంధ్ర జెఎసి కన్వీనర్ కిశోర్ అన్నారు. తెలంగాణ జెఎసి ముసుగులో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) వ్యక్తులు విధ్వంసాలకు దిగారని ఆయన ఆరోపించారు. జెఎసి ముసుగులో కోట్లాది రూపాయలు వసూలు చేశారని ఆయన ఆరోపించారు. తమకు సీమాంధ్ర రాజకీయ నాయకుల నుంచి మద్దతు లభించని మాట వాస్తవమేనని ఆయన అన్నారు. తమతో కలిసి రావాలని, శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమైక్యాంధ్రకు వ్యతిరేకంగా రాకుండా కార్యాచరణకు దిగాలని తాము సీమాంధ్ర నాయకులకు అల్టిమేటం ఇవ్వబోతున్నట్లు ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X