సొమ్ము మనది, షోకు వారిది: సీమాంధ్రులపై కెసిఆర్ ధ్వజం

ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కృష్ణాగోదావరి నదులు నీళ్లు దోచుకున్నారని, నిధులు కొల్లగొట్టారని,ఉద్యోగాలు కాకుండా చేశారని ఆయన అన్నారు. విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ల్యాంకో హిల్స్ పేరు మీద ముస్లింల భూమిని కబ్జా చేశారని ఆయన ఆరోపించారు. అధికార పార్టీ పార్లమెంటు సభ్యులు దీక్ష చేసినా ప్రభుత్వం దిగి రాలేదని, తెలంగాణ పార్లమెంటు సభ్యులకే విలువ లేదని, ప్రజలకు ఏ మేరకు విలువ ఉంటుందో అర్థం చేసుకోవచ్చునని ఆయన అన్నారు. తన దీక్ష వల్ల, కాంగ్రెసు పార్లమెంటు సభ్యుల ఒత్తిడి వల్ల ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తే సీమాంధ్ర నాయకులు జెండాలకు, పార్టీలకు అతీతంగా ఒక్కటై అడ్డుకున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications