తస్మాత్ జాగ్రత్త: సిఎం కిరణ్ కుమార్ రెడ్డికి కెసిఆర్ హెచ్చరిక

పార్లమెంటు సభ్యులు చెప్తే కూడా ముఖ్యమంత్రి వినకపోవడం దౌర్భాగ్యమని ఆయన అన్నారు. ఇదే రీతిలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తెలంగాణ ప్రాంత నాయకులు జెండాలను, పార్టీలను పక్కన పెట్టి పోరాటం చేస్తారని ఆయన చెప్పారు. దీక్ష చేస్తున్న పార్లమెంటు సభ్యుల వెనక 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలున్నారని ఆయన అన్నారు. తెలంగాణ విడిపోవడానికి తగిన ప్రాతిపదిక ఉందని, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు షరతులు లేకుండా జరిగింది కాదని, శాశ్వతం కూడా కాదని ఆయన అన్నారు. తెలంగాణ నాయకులను విభజించి, నెహ్రూలను మోసం చేసి తెలంగాణను విలీనం చేయించారని ఆయన విమర్సించారు. తెలంగాణను ఆంధ్రతో కలపడం నెహ్రూకు ఇష్టం లేదని, పొత్తు కుదరనప్పుడు విడిపోవచ్చునని కూడా నెహ్రూ అన్నారని, దార్శనికుడు కాబట్టే ప్రమాదాన్ని పసిగట్టారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications