నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీకృష్ణ కమిటీ ప్రకారం కేంద్ర సూచనల మేరకు చర్యలు: సిఎం కిరణ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
నిజామాబాద్‌: శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సూచనల మేరకు తాము నడుచుకుంటామని నడుచుకుంటామని ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. విద్యార్థులపై పెట్టిన కేసులను అంచెలంచెలుగా ఎత్తేస్తామని ఆయన చెప్పారు. బ్యాంకులద్వారా తక్కువ వడ్డీతో రైతులకు రుణాలు ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. నిజామాబాద్‌లో ఈరోజు ఓ బహిరంగసభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

మూడు శాతం వడ్డీతో రైతులందరికీ రుణాలు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. ఆరేళ్లనుంచి రైతులకు ఉచిత విద్యుత్తు అందిస్తున్నామని దీనివల్ల రాష్ట్ర ఖజానాపై ఎంతో భారం పడిందని ఆయన అన్నారు. నిజామాబాద్‌ జిల్లాలో ఈ ఏడాది రూ.1150 కోట్ల రుణాలు పంపిణీ చేశామని చెప్పారు. పావలావడ్డీకి రుణాలను కొనసాగించేందుకు కట్టుబడిఉన్నామన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయాలని తమ పార్టీ నమ్ముతుందన్నారు. ఆయన సభలో ప్రసంగిస్తుండగా కొందరు మహిళలు జై తెలంగాణ నినాదాలు చేస్తూ అవరోధం కలిగించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X