హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పిల్లలకు విషమిచ్చి ఉరేసుకున్న తల్లి, ముగ్గురు మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. హైదరాబాదులోని నేరెడ్ మెట్ ప్రాంతంలో జ్యోతి అనే మహిళ ఈ అఘాయిత్యానికి పాల్పడింది. జ్యోతి కాకతీయ నగర్లో ఉంటుంది. ఆమె భర్త ఏడునెలల క్రితం మరణించాడు. భర్త చనిపోయినప్పటినుండి ముగ్గురు పిల్లలను పోషించటం ఆమెకు కష్టంగా మారింది. పెద్ద అమ్మయి పేరు అనూష.

తీవ్ర ఆర్థిక భారంతో ఆమె శుక్రవారం ఉదయం కూల్ డ్రింక్ లో తన ముగ్గురు పిల్లలకు విషాన్ని కలిపి ఇచ్చింది. అనంతరం ఆమె ఉరేసుకుని ఆత్మహత్యచేసుకుంది. జ్యోతితో సహా ఇద్దరు పిల్లలు కూడా మరణించారు. మరో మరో పాప పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఆ పాపను స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు వచ్చి కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X