హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అఖిలపక్షాన్ని బహిష్కరించాలని చంద్రబాబుకు జెఏసి విజ్ఞప్తి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్: తెలంగాణ అంశంపై హోంమంత్రి చిదంబరం ఈ నెల 6న ఏర్పాటు చేసిన అఖిలపక్షాన్ని బహిష్కరించాలని తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి సోమవారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలిశారు. పార్టీకి ఇద్దరిని పిలవటం వల్ల లాభం లేదని దానితో ఎలాంటి ఫలితం ఉండదని వారు చంద్రబాబుకు సూచించారు. అఖిలపక్షానికి పార్టీనుండి ఒక్కరిని పిలిస్తేనే తెలుగుదేశం పార్టీ వెళ్లాలని వారు కోరారు. దానికి చంద్రబాబు ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని వారికి చెప్పారు.

చిదంబరం భేటీకి తెలంగాణ నుండి ఏ పార్టీకి చెందిన నేతలు హాజరు కావద్దని ఉస్మానియా విశ్వవిద్యాలయం జెఏసి సోమవారం పిలుపునిచ్చింది. ఏ పార్టీనుండి ఏ నేత హాజరైనా వారి ఇళ్లముందు శాంతియుతంగా ధర్నాలు చేస్తామని, అవసరమైతే భౌతిక దాడులు కూడా చేస్తామని హెచ్చరించారు. పార్టీకి ఇద్దరిని పిలిచి ఫలితం తేలకుండా చేయడమే కేంద్రం ముఖ్య ఉద్దేశ్యమని వారు ఆరోపించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X