హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజీనామా చేయాలంటూ జైపాల్‌ రెడ్డి ఇంటిముందు న్యాయవాదుల ధర్నా

By Srinivas
|
Google Oneindia TeluguNews

S Jaipal Reddy
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు మద్దతుగా వెంటనే రాజీనామా చేయాలని కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డిని డిమాండ్ చేస్తూ పలువురు తెలంగాణవాదులు హైదరాబాదులోని ఆయన ఇంటిదగ్గర ధర్నా చేపట్టారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికతో సంబంధం లేకుండా తెలంగాణకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి పార్టీపై ఒత్తిడి తీసుకు రావాలని వారు జైపాల్‌ రెడ్డిని డిమాండ్ చేశారు. న్యాయవాదుల ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో న్యాయవాదులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.

తెలుగుదేశం పార్టీ నేతలకు తెలంగాణ కావాలో చంద్రబాబు కావాలో నిర్ణయించుకోవాలని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు, సిద్దిపేట శాసనసభ్యుడు తన్నీరు హరీష్‌రావు డిమాండ్ చేశారు. తెలంగాణకు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఉద్యమించాలని సూచించారు. తెలంగాణలో ఆ పార్టీ నాయకులను ప్రజలు నమ్మె పరిస్థితి లేదన్నారు. ఆ పార్టీల నేతలు తెలంగాణకు మద్దతుగా వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X