హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మాకు పిలుపు రాలేదు, అది సీమాంధ్రుల కుట్ర: పొన్నం ప్రభాకర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Ponnam Prabhakar
హైదరాబాద్: తమకు పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చినట్లు వచ్చిన వార్తలో నిజం లేదని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ చెప్పారు. తమకు అధిష్టానం నుంచి ఎటువంటి పిలుపు రాలేదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ ప్రాంత నాయకుల్లో గందరగోళం సృష్టించడానికి సీమాంధ్రులు అటువంటి ప్రచారానికి దిగారని ఆయన అన్నారు. తమ సమావేశం పార్టీకి వ్యతిరేకం కాదని ఆయన అన్నారు.

తెలంగాణలో పార్టీని బతికించడానికే సమావేశాన్ని తలపెట్టామని, సమావేశంలో భవిష్యత్తు కార్యక్రమాన్ని ఖరారు చేసుకుంటామని, భవిష్యత్తు పోరాటానికి కార్యాచరణ రూపొందించుకుంటామని ఆయన చెప్పారు. రేపు సాయంత్రం కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీతో చర్చల కోసం తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులకు పిలుపు వచ్చినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X