హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణపై పట్టు వీడని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Congress Leaders
హైదరాబాద్‌: తెలంగాణపై కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు పట్టువీడే స్థితిలో ఉన్నట్లు కనిపించడం లేదు. తెలంగాణ ఇవ్వాల్సిందేనని వారు పార్టీ అధిష్టానం వద్ద పట్టుపడుతున్నారు. ఏ విధంగా నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినేట్లు లేరు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్ప ప్రత్యామ్నాయం లేదని కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యుడు కె. కేశవ రావు శనివారం అన్నారు. తెలంగాణ సాధనకు తాము కృతనిశ్చయంతో ఉన్నామని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. తమ విజ్ఞప్తికి పార్టీ అధిష్టానం సానుకూలంగా స్పందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని తాము అధిష్టానానికి చెప్పాల్సిందంతా చెప్పామని ఆయన అన్నారు.

తాము కాంగ్రెసుకు వ్యతిరేకంగా వ్యవహరించడం లేదని, తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని చెబుతున్నామని ఆయన అన్నారు. తెలంగాణ ఇప్పుడు కాకపోతే ఎప్పుడూ రాదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికతో సంబంధం లేకుండా తెలంగాణ ఇవ్వాలని తాము అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నామని ఆయన చెప్పారు. తెలంగాణ కోసం తాము సంక్రాంతి పర్వదినం తర్వాత సోనియాను కలుస్తామని పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు. తెలంగాణ కోసం రాజీనామాలు చేయక తప్పదని శాసనసభ్యులు శ్రీధర్, రాజయ్య అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X