కిరణ్ కుమార్ రెడ్డి వెనక చక్రం తిప్పుతున్న గవర్నర్ నరసింహన్
నరసింహన్ ద్వారానే కాంగ్రెసు పార్టీ అధిష్టానం అన్నీ నడిపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కిరణ్ కుమార్ రెడ్డికి ప్రజారాజ్యం, మజ్లీస్ పార్టీల మద్దతు సంపాదించడంలో కీలక పాత్ర గవర్నర్దేనని అంటున్నారు. తాజాగా, కాంగ్రెసులోని వీర తెలంగాణవాదులను దారికి తెచ్చి తెలంగాణ అంశాన్ని పక్కన పెట్టించే వ్యూహాన్ని కూడా అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గవర్నర్ సూచన మేరకు ముఖ్యమంత్రి పార్టీలోని వీర తెలంగాణవాదులను బుజ్జగించే ప్రయత్నాలు సాగిస్తున్నారని చెబుతున్నారు. ఇందులో భాగంగానే దామోదర్ రెడ్డితోనూ, కేశవరావుతోనూ ముఖ్యమంత్రి చర్చలు జరిపారని చెబుతున్నారు. రాష్ట్ర పరిస్థితిలను చక్కదిద్దడానికి కాంగ్రెసు అధిష్టానం పూర్తిగా నరసింహన్పైనే ఆధారపడినట్లు ప్రచారం జరుగుతోంది.
Comments
నరసింహన్ వైయస్ జగన్ కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ కాంగ్రెసు హైదరాబాద్ narasimhan ys jagan kirankumar reddy telangana congress hyderabad
Story first published: Saturday, January 15, 2011, 15:37 [IST]