శబరిమలలో ఘోర విషాదం: తొక్కిసలాటలో వంద మందికి పైగా మృతి

మృతుల్లో ఎక్కువ మంది తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారే. అయ్యప్ప మకరజ్యోతిని దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఇప్పటి వరకు గుర్తించిన ప్రకారం మృతుల్లో ఎక్కువ మంది తమిళనాడుకు చెందినవారున్నారు. తమిళనాడుకు చెందిన 22 మంది, కర్ణాటకకు చెందిన 14 మందిని, ఆంధ్రప్రదేశ్కు చెందిన 11 మందిని ఇప్పటి వరకు గుర్తించారు. గాయపడినవారిని కొట్టాయం వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు.
సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. ప్రమాదం జరిగిన స్థలం అటవీ, కొండ ప్రాంతం కావడంతో సహాయక చర్యలకు కాస్తా ఇబ్బందిగా ఉంది. ఈ ప్రమాదం నేపథ్యంలో కేరళ ప్రభుత్వం నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. సన్నిధానానికి అతి సమీపంలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి అచ్యుతానంద అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించారు.
హెల్ప్ లైన్ 04869 - 222049












Click it and Unblock the Notifications