వైయస్ జగన్పై మరోసారి కాంగ్రెసు నేత వి. హనుమంతరావు ఫైర్
విజయవాడ నుంచి ఢిల్లీకి వచ్చేసరికి శాసనసభ్యుల బలం 30 నుంచి 21కి తగ్గిందని, ఇంకా జగన్ బలం తగ్గుతుందని ఆయన అన్నారు. తన తల్లి విజయమ్మపై వివేకానంద రెడ్డి పోటీ చేస్తే తన తండ్రి వైయస్సార్ ఆత్మ క్షోభిస్తుందని జగన్ అంటున్నాడని, జగన్ చేసేది చూసి వైయస్ బతికి ఉన్నా చచ్చిపోయినవాడిలాగే అయ్యేవాడని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీని, సోనియా గాంధీని వ్యతిరేకించలేదని ఆయన గుర్తు చేశారు. ఓసారి కాంగ్రెసుకు వ్యతిరేకంగా చేసి వైయస్సార్ ఆత్మ విమర్శ చేసుకున్నారని ఆయన చెప్పారు. ఇందిరమ్మకు, హస్తం గుర్తుకు రాష్ట్రంలో ఓటు బ్యాంక్ ఉందని, కాంగ్రెసును జగన్ ఏమీ చేయలేడని ఆయన అన్నారు.
Comments
వి హనుమంతరావు వైయస్ జగన్ వైయస్ వివేకానందరెడ్డి హైదరాబాద్ v hanumanth rao congress ys jagan ys vivekananda reddy hyderabad
Story first published: Saturday, January 15, 2011, 12:20 [IST]