వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెంకయ్య, నారాయణలను ఎందుకు నిలదీయతడం లేదు: విహెచ్

By Pratap
|
Google Oneindia TeluguNews

V Hanumantha Rao
హైదరాబాద్‌: సమైక్యాంధ్ర ఉద్యమం బలంగా ఉంటే సీమాంధ్ర ప్రజలు బిజెపి సీనియర్ నాయకుడు ఎం. వెంకయ్యనాయుడిని, సిపిఐ రాష్ట్ర కార్యదర్సి నారాయణను ఎందుకు నిలదీయడం లేదని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత సీనియర్ నేత వి. హనుమంతరావు ప్రశ్నించారు. తెలంగాణ ప్రాంత జర్నలిస్టులు శనివారం విహెచ్‌ను కలిసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వెంకయ్యనాయుడు, నారాయణ కోరుతున్నారని, సమైక్యాంధ్ర ఉద్యమం బలంగా ఉంటే సీమాంధ్ర ప్రజలు వారిని నిలదీయాలి కదా అని ఆయన అన్నారు.

తెలంగాణ ఇవ్వకపోతే మళ్లీ గెలవలేమని, ప్రజల్లో తిరగలేమని తాము తమ కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి చెప్పామని ఆయన అన్నారు. రాజీనామాలు చేయడం ద్వారా సాధించేది ఏమీ లేదని, పదవుల్లో ఉంటేనే తెలంగాణ కోసం గట్టిగా కృషి చేయవచ్చునని ఆయన అన్నారు. క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని ఆయన పార్టీ అధిష్టానాన్ని కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X