కేంద్ర మంత్రివర్గంలో రెడ్లకే ప్రాధాన్యమా, సీమాంధ్రపై నిర్లక్ష్యమా: రాయపాటి

Rayapati Sambasiva Rao
న్యూఢిల్లీ: మంత్రి వర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంత్రివర్గంలో స్థానం దక్కకపోవడంపై కాంగ్రెసు గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు మరోసారి పార్టీ అధిష్టానంపై నిప్పులు చెరిగారు. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి పదవి దక్కకపోవడంపై ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు అసంతృప్తితో ఉన్నారనే వార్తలపై ఆయన గురువారం ఆయన మీడియా వద్ద తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఒక్క కావూరి మాత్రమే కాదు, సీమాంద్ర పార్లమెంటు సభ్యులంతా అసంతృప్తితో ఉన్నారని ఆయన అన్నారు.

కేంద్ర మంత్రివర్గంలో రెడ్లకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన విమర్శించారు. 2004 నుంచి కేంద్ర మంత్రివర్గంలో క్యాబినెట్ మంత్రిగా సీమాంధ్ర నుంచి ఒక్కరిని కూడా నియమించలేదని, సీమాంధ్రపై కాంగ్రెసు అధిష్టానం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన విమర్శించారు. సీమాంధ్ర నుంచి 21 మంది పార్లమెంటు సభ్యులుంటే ఒక్క కేబినెట్ పదవి కూడా ఇవ్వరా అని ఆయన అడిగారు. రాష్ట్ర రాజకీయాలపై పార్టీ అధిష్టానానికి ఆసక్తి లేదని ఆయన అన్నారు. శాసనసభ్యురాలు కొండా సురేఖ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని విమర్శిస్తుంటే కేంద్ర, రాష్ట్ర మంత్రులు చోద్యం చూస్తున్నారని ఆయన అన్నారు. ఈ స్థితిలో ఏ ముఖం పెట్టుకుని కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీతో సమావేశానికి సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు వెళ్తారని ఆయన అడిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+