వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శబరిమల తొక్కిసలాట: తమ తప్పు లేదని కోర్టుకు చెప్పిన పోలీసులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Sabarimala Pilgrimage
త్రివేండ్రం: శబరిమలలో తొక్కిసలాట ఘటనపై కేరళ హైకోర్టుకు ప్రభుత్వం గురువారంనాడు సమగ్ర నివేదిక సమర్పించింది. ఆటోరిక్షాను జీపు ఢీకొనటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రభుత్వం ఆ నివేదికలో పేర్కొంది. తమవైపు నుంచి ఎలాంటి పొరపాటు లేదని, తొక్కిసలాట జరిగిన వెంటనే స్పందించామని సమర్థించుకుంది. భద్రత కోసం కావల్సినంతమంది పోలీసులను ఏర్పాటు చేసామంది. విచ్చలవిడిగా వాహనాలను పార్కింగ్ చేయటంతో పాటు ఇరుకు దారి వల్లే ఈ దుర్ఘటన జరిగిందని నివేదికలో తెలియచేసింది. తొక్కిసలాట వ్యవహారంలో తమ తప్పేమీ లేదని పోలీసులు తెలిపారు.

ట్రావంకోర్ దేవస్థానం బోర్డు మాత్రం సరైన భద్రతా ఏర్పాట్లు చేయలేదని ప్రభుత్వంపై నింద వేసింది. అయితే తమ వైఫల్యమేదీ లేదని, తాము 250 మంది పోలీసులను పులిమేడు ప్రాంతంలో నియోగించామని డిజిపి చెప్పారు. పులిమేడు ప్రాంతంలో తమ అధికారులు తగినంత మంది ఉన్నారని అటవీ శాఖ తెలిపింది. పులుల అభయారణ్యమని తెలిసి పులిమేడు ప్రాంతంలో యాత్రికులను ఎందుకు అనుమతించారని కేరళ హైకోర్టు ప్రశ్నించింది. శబరిమలలో జరిగిన తొక్కిసలాటలో 102మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X