తెలంగాణపై ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్, దానికి కట్టుబడ్తాం: షకీల్

పార్టీలతో సంప్రదింపుల తర్వాత కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై నిర్ణయం తీసుకుంటుందని, శ్రీకృష్ణ కమిటీ నివేదికపై సంప్రదింపులు జరుపుతోందని ఆయన అన్నారు. ఏకాభిప్రాయానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆయన అన్నారు. అంత తొందరగా ఏకాభిప్రాయం సాధ్యం కాదని ఆయన అన్నారు. మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వెంట వెళ్లినవారిపై చర్యలు తీసుకునే విషయంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆ విషయాన్ని పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీని అడగండని ఆయన సమాధానమిచ్చారు.












Click it and Unblock the Notifications