వైయస్ జగన్ బలం తగ్గుతోందా, ఎమ్మెల్యేలు జారిపోతున్నారా?

కిరణ్ కుమార్ రెడ్డి కట్టడితో జగన్కు మద్దతిచ్చే శాసనసభ్యుల సంఖ్య 19కి పడిపోయిందని అంటున్నారు. జగన్ విజయవాడలో జరిగిన లక్ష్య దీక్ష సందర్భంగా ఎమ్మెల్యేలతో తన బల పరీక్ష చేశారు. ఆ రోజు 23 మంది ఎమ్మెల్యేలు (పీఆర్పీ ఇద్దరు, టీడీపీ ఒకరు సహా) జగన్ వెంట నిలిచారు. ఆ తర్వాత ఢిల్లీలో జరిగిన 'జల దీక్ష'లో ఆ సంఖ్య 24గా (పీఆర్పీ ఇద్దరు, టీడీపీ ఒకరు సహా) ఉంది. మొన్న పెట్రోల్ ధర పెంపునకు నిరసనగా విశాఖపట్నంలో చేసిన జనదీక్ష 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు.
బుధవారం జగన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కేవలం ఎనిమిది మందే పాల్గొన్నారు. మిగిలిన వారు వేర్వేరు కారణాల రీత్యా హాజరు కాలేక పోయారని జగన్ వర్గం చెబుతోంది. అయితే బుధవారంనాడే కుంజా సత్యవతి, రేగా కాంతారావు జారిపోయారు. చిత్తూరు జిల్లాకు చెందిన కుతూహలమ్మ, పి. రవిలను బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలా వైయస్ జగన్కు మద్దతిచ్చే ఎమ్మెల్యేల బలం తగ్గిపోతోందని అంటున్నారు. ఈ స్థితిలోనే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని దించే ప్రయత్నాలను జగన్ వర్గం చేయడం లేదని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications