జగన్కు ఖమ్మం ఎమ్మెల్యేల ఝలక్, ఫలించిన సిఎం కిరణ్ వ్యూహం

కార్యకర్తలు మనోభావాల మేరకు తాను నిర్ణయించుకుంటానని చెప్పారు. అయితే తాను ప్రస్తుతం కాంగ్రెసు పార్టీలోనే ఉన్నానని, తమ ముఖ్యమంత్రి కిరణ్ అని చెప్పారు. తన నియోజకవర్గం చాలా వెనుకబడిన ప్రాంతమని, కాబట్టి ప్రభుత్వంలో ఉండి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాల్సిన భాధ్యత ఉందన్నారు. కాంగ్రెసు ప్రభుత్వానికి మరో మూడేళ్లు ఉందన్నారు. ముఖ్యమంత్రితో చర్చలో జగన్ ప్రస్తావన రాలేదని కాంతారావు అన్నారు. ప్రజా సమస్యలపై పోరాడితేనే తాను జగన్ వెంట ఉంటానని భద్రాచలం ఎమ్మెల్యే కుంజా సత్యవతి స్పష్టం చేశారు. అయితే జగన్కున్న ఆదరణ ఓర్వలేకే ఆయనపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications