వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిఎం రచ్చబండ ఉద్రిక్తం: పోలీసులపైకి రాళ్లు రువ్విన తెలంగాణవాదులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
నల్లగొండ: నల్లగొండ జిల్లా కొండామల్లేపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రచ్చబండ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి ప్రసంగిస్తుండగా తెలంగాణవాదులు సభా ప్రాంగణంపైకి రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో దేవరకొండ డిఎస్పీ అహ్మద్ అలీ గాయపడ్డారు. ఆయనను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జీ చేశారు, బాష్పవాయువు కూడా ప్రయోగించారు. జై తెలంగాణ నినాదాలు చేస్తూ తెలంగాణవాదులు రాళ్లు రువ్వారు.

తెలంగాణవాదులు 15 వాహనాలను ధ్వంసం చేశారు. ముగ్గురు బిజెపి కార్యకర్తలు సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటామని కూడా బెదిరించారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఉద్యమాన్ని పక్కదోవ పట్టించేందుకే ముఖ్యమంత్రి రచ్చబండ కార్యక్రమం చేపట్టారని తెలంగావాదులు విమర్సిస్తున్నారు. దాదాపు 3 వేల మంది పోలీసులను మోహరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X