వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుస్మితా గంగూలీ థామస్‌ను కలిసిన ట్రైవ్యాలీ భారత విద్యార్థులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Tri-Valley University
వాషింగ్టన్: ట్రైవ్యాలీ విశ్వవిద్యాలయం మోసంలో చిక్కుకున్న భారత విద్యార్థులు శాన్ ఫ్రాన్సిస్కోలోని కాన్సుల్ జనరల్‌ను కలుసుకున్నారు. తమ చదువులు పూర్తి చేసుకునేందుకు సహాయం చేయాలని వారు కాన్సుల్ జనరల్ సుస్మితా గంగూలీ థామస్‌ను కోరారు. తాము ఏ విధమైన నిబంధనలను ఉల్లంఘించలేదని వారు చెప్పారు. వీసా మోసాలకు పాల్పడిన ట్రైవ్యాలీ విశ్వవిద్యాలయాన్ని అమెరికా అధికారులు మూసివేయించిన విషయం తెలిసిందే. విద్యార్థుల పరిస్థితిపై కచ్చితమైన విషయాలు చెప్పాలని తాను అమెరికా ప్రభుత్వాన్ని కోరినట్లు థామస్ చెప్పారు.

విద్యార్థులు వేరే విశ్వవిద్యాలయంలో చేరి తమ చదువులు పూర్తి చేసుకోవడానికి గల అవకాశాలపై కూడా వివరాలు అడిగినట్లు ఆమె తెలిపారు. తాను శాన్ ఫ్రాన్సిస్కోలోని విదేశీ మిషన్‌కు, అమెరికా ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంటుకు లేఖలు రాసినట్లు ఆమె చెప్పారు. ఈ నెల 25వ తేదీన రాసిన తన లేఖలకు ఇప్పటి వరకు ఏ విధమైన సమాధానం రాలేదని ఆమె చెప్పారు. ట్రైవ్యాలీ విశ్వవిద్యాలయంలో చేరిన భారత విద్యార్థుల్లో ఎక్కువ మంది తెలుగువారే ఉన్నారు.

తమ వద్దకు వచ్చిన విద్యార్థుల్లో ఎక్కువ మంది ఏ విధమైన వీసా, ఇమిగ్రేషన్ నిబంధనలను ఉల్లంఘించలేదని, విశ్వవిద్యాలయం మోసపూరిత లక్షణం గురించి వారికి తెలియదని, చదువులను పూర్తి చేసుకోవడమే వారి ప్రధాన లక్ష్యమని, అందువల్ల వేరే విశ్వవిద్యాలయంలో చేరడానికి వారికి అవకాశం కల్పించాలని శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ కాన్సుల్ (కమ్యూనిటీ అఫైర్స్) అశోక్ కుమార్ సిన్హా అన్నారు. వీసా, ఇమిగ్రేషన్ నిబంధనల ఉల్లంఘనలో విద్యార్థుల పాత్ర కూడా ఉందనే వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X