గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాలకృష్ణ కాల్పుల కేసును ముందుకు తెచ్చిన జగన్ క్యాంప్

By Pratap
|
Google Oneindia TeluguNews

Ambati Rambabu
గుంటూరు: పరిటాల రవీంద్ర హత్య కేసులో వైయస్ జగన్ ప్రమేయంపై తిరిగి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్న తెలుగుదేశంపై జగన్‌వర్గం నేతలు ఎదురు దాడికి దిగారు. బాలకృష్ణ కాల్పుల కేసును ముందుకు తెచ్చారు. ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై జరిపిన కాల్పుల కేసును రీ ఓపెన్ చేయాలని ఆ వర్గం ముఖ్యనేత అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. మంగళవారం పిడుగురాళ్లలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. బాలకృష్ణ కాల్పుల కేసుతో పాటు, పీసీసీ మాజీ చీఫ్ కేశవరావు కుమారుడి కాల్పుల కేసును కూడా రీ ఓపెన్ చేసి విచారణ నిర్వహించాలని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన జగన్‌కి కానీ, ఆయనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలకు కానీ లేదన్నారు. కాంగ్రెస్ నాయకత్వం తనకు తానే ఏదో ఊహించుకొని ప్రజారాజ్యం పార్టీ మద్దతు కోసం తహతహలాడుతున్నదని వ్యాఖ్యానించారు. ప్రస్తుత సమీకరణాల నేపథ్యంలో ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనమైనా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో రెండు దఫాలు పార్టీ అధికారంలోకి రావటానికి ప్రధాన కారకుడైన వైఎస్ కుటుంబాన్ని, ఆయన మరణానంతరం పూర్తిగా విస్మరించి, నానా రకాలుగా అవమానాల పాలుచేశారని ఆరోపించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X