వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యెడ్యూరప్ప నగ్నంగా కటిక నేలపై పడుకున్నారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

BS Yeddyurappa
బెంగళూరు: తాంత్రికుల సలహా మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యెడ్యూరప్ప సోమవారం నుంచి నగ్న వ్రతం ప్రారంభించినట్లు ఈ ప్రముఖ తెలుగు దినపత్రికలో ఓ వార్తాకథనం ప్రచురితమైంది. ఇందులో భాగంగా ఆయన కటిక నేలపై నగ్నంగా నిద్రిస్తున్నట్లు ఆ పత్రిక రాసింది. తనపై ఎవరో చేతబడి చేశారని నమ్ముతున్న యెడ్యూరప్ప దానికి విరుగుడుగా తాంత్రికుల సలహా మేరకు ఆ వ్రతాన్ని ప్రారంభించినట్లు చెబుతున్నారు. చేతబడి నుంచి బయట పడాలంటే అమావాస్యకు ముందు రెండు రోజులపాటు కటిక నేల మీద నగ్నంగా పడుకోవాలని తాంత్రికులు ఆయనకు సూచించారట. తాంత్రికుల సలహా మేరకు సోమవారం నుంచే 'నగ్న వ్రతాన్ని' ప్రారంభించారట.

తన విరోధులు ప్రయోగించిన చేతబడిని నిర్వీర్యం చేసేందుకే ఆయన ఇలా చేస్తున్నారని ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే వర్గాలు వివరించాయని ఆ పత్రిక రాసింది. దానితో అయిపోలేదట. వచ్చే వారం మరో కార్యక్రమం ఉందట. పూర్తి నగ్నంగా ఓ నదిలో 12 సూర్య నమస్కారాలు చేయడం ఆ కార్యక్రమమని అంటున్నారు. ఈనెల ఎనిమిది నుంచి పదో తేదీ మధ్య ఆయన వాటిని పూర్తి చేయనున్నారట. "యడ్యూరప్పది వృశ్చిక రాశి. ఈ రాశిలోకి త్వరలోనే రాహువు ప్రవేశించనున్నాడు. దాని అర్థం.. ఆయన ప్రత్యర్థులు ఆయనకు ముప్పు తెచ్చే అవకాశం ఉంది. దీన్ని అధిగమించాలంటే నగ్నంగా సూర్య నమస్కారాలు చేయాల్సి ఉంటుంది'' అని యడ్యూరప్ప కుటుంబ పూజారి భానుప్రకాశ్ శర్మ తెలిపినట్లు ఆ పత్రిక రాసింది.

అయితే, ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు ఈ కథనాలను ఖండించాయి. అయితే ఇప్పటికే ఎవరో తనపై చేతబడి చేశారంటూ యెడ్డి భయాందోళనలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సచివాలయంలోకి అడుగు పెట్టడానికి కూడా తాను భయపడుతున్నానని సోమవారం ఆయన సంచలన ప్రకటన చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X