గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రులు డొక్కా మాణిక్యవరప్రసాద్, కన్నా లక్ష్మినారాయణ మధ్య వార్

By Pratap
|
Google Oneindia TeluguNews

Guntur
గుంటూరు: గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు రాష్ట్ర మంత్రుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. జగ్జీవన్ రామ్ విగ్రహ ప్రతిష్టాపనపై మంత్రులు డొక్కా మాణిక్య వరప్రసాద్, కన్నా లక్ష్మినారాయణల మధ్య వార్ జరుగుతోంది. గుంటూరులోని హిందూ కాలేజీ వద్ద జగజీవన్ రామ్ విగ్రహ ప్రతిష్టాపనకు అనుమతి లభించింది. అక్కడ డొక్కా మాణిక్య వరప్రసాద్ సహకారంతో దళిత సంఘాలు తయారు చేయించిన విగ్రహాన్ని ప్రతిష్టించాలని అనుకున్నారు. అయితే, జిల్లా కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు పుష్పాదేవి మంత్రి కన్నా లక్ష్మినారాయణ తెప్పించిన విగ్రహాన్ని ప్రతిష్టించడానికి పూనుకున్నారు. దీంతో ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి.

కాగా, ఇద్దరు మంత్రుల మధ్య జిల్లాలో ఆధిపత్య పోరు సాగుతోంది. కన్నాకు వ్యతిరేకంగా దళిత సంఘాలు ఆందోళనలకు దిగునతున్నాయి. తాము తయారు చేయించిన విగ్రహాన్ని నెలకొల్పాలని ఆ సంఘాలు పట్టుబడుతున్నాయి. మంత్రుల మధ్య వివాదం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి చేరింది. కన్నా లక్ష్మినారాయణపై డొక్కా మాణిక్యవరప్రసాద్ ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X