అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా చట్టాలు మారాలి: ప్రధాని
మానవుల గౌరవాన్ని కాపాడేందుకు న్యాయవ్యవస్థ కట్టుబడి ఉందనే హామీ ఉండాలని చెప్పారు. రాజ్యాంగ సూత్రాలను యథాతథంగా పాటించాలన్నదే తమ ఉద్దేమని వెల్లడించారు. ప్రపంచానికి కొత్త ఆర్థిక వ్యవస్థ కావాలన్నారు. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాలు కొత్త సవాళ్లను ఎదుర్కొనవలసి వస్తుందన్నారు. న్యాయం, చట్టాల్లో కూడా మార్పు రావాలి సూచించారు.
సామాన్యుడి అభివృద్ధితే ప్రాధాన్యత ఉంటుందన్నారు. దారిద్రం, టెర్రరిజం, నిరక్షరాస్యత, మానవ హక్కుల ఉల్లంఘన వంటి వాతావరణ పరిస్థితులను అభివృద్ది చెందుతున్న దేశాలు ఎదుర్కొనవలసి ఉంటుందన్నారు. అభివృద్ధితోనే దారిద్ర నిర్మాలన సాధ్యం అన్నారు. ప్రభుత్వ ఫలాలు అన్ని వర్గాలకు అందాలని అన్నారు. రాజ్యాంగ సూత్రాలను అమలు పరచడమే ముఖ్యమని చెప్పారు.
కాగా కార్యక్రమంలో న్యాయశాఖ మంత్రి వీరప్పమొయిలీ, గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డిలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని శనివారం సాయంత్రం హైదరాబాద్కు వచ్చారు. పది దేశాల ప్రధాన న్యాయమూర్తులు ఈ సదస్సులో పాల్గొననున్నారు.