హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పార్టీ నిర్మాణంపై వైయస్ జగన్ దృష్టి: నేడు మద్దతుదారులతో సమావేశం

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీని ప్రకటించేకంటే ముందే రాష్ట్రంలో పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ శుక్రవారం తన మద్దతుదారులు, ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. పార్టీ పేరు ఖరారు కావడం, నిర్మాణ పనులు తదితర ప్రక్రియ కావడానిక మరో నెల రోజులు పట్టవచ్చు. జగన్ సైతం తన పార్టీ పేరును భారీ బహిరంగ సభ మధ్య ప్రకటించడానికి సుమారు మరో నెల రోజుల సమయం ఉంది. పార్టీ పేరుతో సంబంధం లేకుండా జగన్ ఇప్పటినుండే తన పార్టీ వ్యవస్థపైన దృష్టి సారిస్తున్నారు.

శుక్రవారం జరగనున్న సమావేశంలో ముఖ్యనేతలతో సమావేశం అనంతరం జగన్ ఒక్కో ప్రాంతానికి కో ఆర్డినేటర్లను నియమించనున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో జిల్లాకు ఒక్కో కోఆర్డినేటర్‌ను కూడా నియమించనున్నారని తెలుస్తోంది. పార్టీ ప్రకటన కంటే ముందుగానే మండలస్థాయిలో పార్టీ వ్యవస్థను తీర్చిదిద్దే పనిలో పడ్డారు.

English summary
Ex Parliament Member YS Jaganmohan Reddy is concentrating on party. He is thinking to strengthen party before announcing. So, he will meet with his followers today on this issue. After this meeting he may nominate area wise co-ordinators.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X